Friday, May 3, 2024

India Corona: 24 గంటల్లో 343 మంది మృతి

దేశంలో కరోనా కేసులు తగ్గుతున్న వేళ.. మరణాల సంఖ్య మాత్రం పెరుగుతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన తాజా బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,974 కరోనా కేసులు నమోదు కాగా.. 343 మంది కరోనాతో ప్రాణాలు వదిలారు. దీంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 4,76,478కి చేరింది. గడిచిన 24 గంటల్లో 7,948 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,41,54,879కి చేరింది. ప్రస్తుతం దేశంలో 87,245 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతోంది. ఇప్పటి వరకు మొత్తం 135.25 కోట్ల మందికి కరోనా టీకా అందించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement