Wednesday, May 22, 2024

India Corona: దేశంలో పూర్తిగా తగ్గిన కరోనా.. కొత్తగా ఎన్ని కేసులంటే..

దేశంలో కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గిపోయింది. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 5,921 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 289 మంది కరోనాతో మరణించారు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11651 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 63,878 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,29,57,477కు చేరింది. ఇందులో మొత్తం 4,23,78,721 మంది బాధితులు కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇక, దేశవ్యాప్తంగా కరోనాతో 5,14,878 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1,78,55,66,940 మందికి కోవిడ్ వ్యాక్సిన్లు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement