Wednesday, May 1, 2024

CORONA UPDATE: దేశంలో 34 వేలు దాటిన కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి మళ్లీ విజృంభిస్తుంది. నాలుగు రోజులపాటు తగ్గిన కేసులు.. గురువారం నుంచి మళ్లీ పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 34,403 కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,33,47,325కు చేరింది. ప్రస్తుతం 3,49,056 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 3,25,98,424 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇందులో కొత్తగా 37,950 మంది వైరస్‌ నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక దేశంలో 77.24 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది. నిన్న దేశంలో 64,51,423 వ్యాక్సిన్ డోసుల‌ను ప్ర‌జ‌ల‌కు వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement