Thursday, May 2, 2024

CORONA UPDATE: దేశంలో తగ్గిన కేసులు.. పెరిగిన మరణాలు

దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. చాలా రోజులు తర్వాత 30 వేల దిగువకు  వచ్చాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 28,591 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 34,848 మంది కరోనా నుంచి కోలుకోగా.. కొత్తగా 338 మంది మృతి చెందారు. దేశంలో కొత్తగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో కేరళలో 20,487 కేసులు ఉండగా.. 181 మంది మరణించారు.

దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,32,36,921కు చేరింది. ఇందులో 3,24,09,345 మంది బాధితులు కరోనా నుంచి ఆరోగ్యవంతులైయ్యారు. ప్రస్తుతం 3,84,921 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తం 4,42,655 మంది బాధితులు వైరస్‌ తో మరణించారు.  ఇక ఇప్పటివరకు 73,82,07,378 కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. శనివారం ఒకేరోజు 72,86,883 మందికి వ్యాక్సినేషన్‌ చేశామని పేర్కొంది.

ఇది కూడా చదవండిః 3 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వాలిః కేంద్రానికి స్థాయీ సంఘం సిఫార్సు

Advertisement

తాజా వార్తలు

Advertisement