Thursday, May 2, 2024

Covid: భారత్ లో కరోనా ఉద్ధృతి.. 12 లక్షలకు చేరిన యాక్టివ్ కేసులు

భారత్​లో కరోనా కేసుల ఉద్ధృతి పెరిగింది. రోజువారీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన తాజా బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,64,202 కేసులు నమోదయ్యాయి. కరోనాతో మరో 315 మంది మరణించారు. అదే సమయంలో 1,09,345 మంది బాధితులు కోవిడ్ ​ నుంచి కోలుకున్నారు. దేశంలో ఇప్పటివరకు మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,48,24,706కి చేరింది. ప్రస్తుతం దేశంలో 12,72,073 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తం 4,85,350 మంది కరోనాతో మరణించారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 14.78 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement