Friday, March 29, 2024

జీవీఎల్ లేఖ‌పై స్పందించిన కేంద్ర మంత్రి ‘జ్యోతిరాదిత్య సింథియా’

వైసీపీ నేత‌లు తిరుప‌తి రేణిగుంట విమానాశ్ర‌యంతో పాటు, సిబ్బంది నివాసం ఉండే క్వార్ట‌ర్స్ కు నీటి స‌ర‌ఫ‌రాని నిలిపివేశార‌ని బిజెపి రాజ్య‌స‌భ స‌భ్యుడు జీవీఎల్ న‌ర‌సింహారావు కేంద్రానికి లేఖ రాశారు. ఈ మేర‌కు ఈ లేఖ‌పై కేంద్ర పౌర విమాన‌యాన‌శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా స్పందించారు. కేంద్రం తరఫున ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తామని, తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విమానశ్రయంలో ప్రయాణికులకు, సిబ్బందికి ఇకపై ఎంతమాత్రం అసౌకర్యం కలగదని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. కాగా, ఓ పత్రికలో వచ్చిన కథనం ఆధారంగా జీవీఎల్ కేంద్రానికి లేఖ రాశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement