Thursday, May 2, 2024

CORONA UPDATE: దేశంలో కరోనాతో 383 మంది మృతి

దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 26,964 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 34,167 మంది కోలుకున్నారని, 383 మంది కొత్తగా మృతిచెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,35,31,498కి చేరింది. ఇందులో 3,27,83,741 మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 4,45,768 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం 3,01,989 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా కరనా వ్యాక్సిన్‌ పంపిణీ ప్రక్రియ జోరుగా కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 82,65,15,754 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇది కూడా చదవండి: చిన్నారులకు కోవ్యాక్సిన్ సిద్ధం: భారత్ బయోటెక్

Advertisement

తాజా వార్తలు

Advertisement