Monday, April 29, 2024

చిన్నారులకు కోవ్యాక్సిన్ సిద్ధం: భారత్ బయోటెక్

కోవిడ్ నియంత్రణలో మరో ముందడుగు పడబోతోంది. ఇప్పటివరకు 18ఏళ్లు నిండిన వారికే అందించిన కోవిడ్ వ్యాక్సినేషన్ ఇకపై 18ఏళ్ల లోపు చిన్నారులకు కూడా అందుబాటులోకి రానుంది. ఈ మేరకు కోవ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ వెల్లడించింది. త్వరలో చిన్నపిల్లలకు కూడా అందించేందుకు కోవ్యాగ్జిన్‌ను సిద్ధం చేస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటికే 2, 3 దశల ట్రయల్స్ పూర్తయ్యాయని, దానికి సంబంధించిన ఫలితాలను భారత ఔషధ నియంత్రణ సంస్థ (DCGI)కు అందజేశామని వెల్లడించింది. 18 ఏళ్లు నిండిన వారికి ఇచ్చే డోసు కన్నా ఇది తక్కువగా ఉంటుందని పేర్కొంది.

ట్రయల్స్ విజయవంతంగా పూర్తయ్యాయని, డీసీజీఐ ఆమోదం లభించిన వెంటనే అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని భారత బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్లా వెల్లడించారు. దీనికి తోడు 18 ఏళ్లు నిండిన వారికి అందిస్తున్న వ్యాక్సిన్ ఉత్పత్తిని కూడా పెంచుతామని తెలిపారు. ఈ నెలలో ఇప్పటికే 3.5 కోట్ల డోసులను ఉత్పత్తి చేశామని, అక్టోబర్‌‌లో ఈ సంఖ్యను 5.5 కోట్లకు పెంచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఇతర భాగస్వామ్య సంస్థలు కూడా ఉత్పత్తి ప్రారంభిస్తే.. ఈ సంఖ్య 10 కోట్లు దాటే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్ష

Advertisement

తాజా వార్తలు

Advertisement