Thursday, May 16, 2024

Covid-19: భారత్ లో కొత్తగా 2.9 లక్షల కేసులు.. 959 మరణాలు

దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 2,09,918 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే, కోవిడ్ తో దేశవ్యాప్తంగా 959 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,95,050కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 18,31,268గా ఉంది.

గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,62,628 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 3,89,76,122కు చేరింది. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,13,02,440 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,66,03,96,227 మందికి కరోనా వ్యాక్సిన్లు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. దేశంలో రోజువారీ కరోనా పాజివీటి శాతం 15.77% గా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement