Sunday, April 28, 2024

India Corona Update: కొత్తగా 12,729 కరోనా కేసులు.. 221 మరణాలు

దేశంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 12,729 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మరో 221 మంది కోవిడ్‌ బాధితులు  ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 12,165 మంది బాధితులు మహమ్మారి నుంచి పూర్తిస్థాయిలో కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,43,33,754కు చేరింది. ఇందులో 3,37,24,959 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 1,48,922 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తం 4,59,873 మంది వైరస్ తో మరణించారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 0.43 శాతంగా ఉండగా, రికవరీ రేటు 98.23 శాతానికి పెరిగింది. నిన్న 5,65,276 మంది వ్యాక్సిన్‌ తీసుకున్నారు. దేశవ్యాప్తంగా 1,07,70,46,116 కరోనా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇది కూడా చదవండి: Diwali special: మహేష్ బాబుకు గిఫ్టులు పంపిన వవన్ కల్యాణ్

Advertisement

తాజా వార్తలు

Advertisement