Sunday, April 28, 2024

దేశంలో 84 కోట్లు దాటిన వ్యాక్సినేషన్.. కొత్త కేసులు ఎన్నంటే..

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 31,382 కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 32,542 మంది వైరస్‌ నుంచి కోలుకోగా.. 318 మంది మరణించారు. తాజా కరోనా కేసులు, మరణాల్లో అత్యధికంగా కేరళలోనే నమోదయ్యాయి. రాష్ట్రంలో నిన్న 19,682 కేసులు నమోదవగా.. 152 మంది మృతిచెందారు.

దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,35,94,803కి చేరాయి. ఇందులో 3,28,48,273 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 3,00,162 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కరోనా కారణంగా ఇప్పటివరకు 4,46,368 మంది మరణించారు. ఇక దేశవ్యాప్తంగా మొత్తం 84,15,18,026 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న ఒక్క రోజే 72,20,642 మందికి వ్యాక్సినేషన్‌ వేసినట్లు వెల్లడించింది.

ఇది కూడా చదవండి: వార్నర్ డకౌట్ ఆశ్చర్యం కలిగించలేదు: పీటర్సన్..

Advertisement

తాజా వార్తలు

Advertisement