Sunday, April 28, 2024

India Corona update: కొత్త‌గా 12,885 క‌రోనా కేసులు

దేశంలో కరోనా ఉధృతి సాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్త‌గా 12,885 క‌రోనా కేసులు నమోదయ్యాయి. నిన్న క‌రోనా నుంచి 15,054 మంది కోలుకున్నారు. అదే సమయంలో క‌రోనాతో 461 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్ర‌స్తుతం 1,48,579 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా నుంచి మొత్తం 3,37,12,794 మంది కోలుకున్నారు. క‌రోనా వ‌ల్ల మొత్తం 4,59,652 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో నిన్న 30,90,920 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు 1,07,63,14,440 మందికి వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement