Sunday, May 5, 2024

IND vs PAK: మహిళల ప్రపంచ కప్: కష్టాల్లో పడిన మిథాలీ రాజ్‌ సేన

మహిళ ప్రపంచకప్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరుగుతున్న వన్డేలో టీమిండియా అచితూచి ఆడుతోంది. మిథాలీ రాజ్‌ సేన వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.  మౌంట్ మాంగనూయిలో పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసిన హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌.. నిధా ధార్‌ బౌలింగ్‌లో ఎల్బీ రూపంలో పెవిలియన్‌కు చేరింది. ఇక క్రీజులో ఉన్న కెప్టెన్‌ మిథాలీపై జట్టు భారం అంతా పడింది.

కాగా, ప్రపంచకప్‌లో భారత్ తన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తోనే ఆడుతుండడంతో ఈ మ్యాచ్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. 2017, 2005 ఎడిషన్‌లలో రన్నరప్‌గా నిలిచిన భారత్.. ఒక అడుగు ముందుకేసి తమకు దూరమైన టైటిల్‌ను కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement