Tuesday, April 30, 2024

సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ

సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బృందావన్ కాలనీలో సీసీ కెమెరాలను ఏసిపి సారంగపాణితో కలిసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఆయన మాట్లాడుతూ.. రహదారులతో పాటు కాలనీలలో సైతం పెద్దఎత్తున సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. వ్యాపారులు తమ దుకాణాల వద్ద వ్యాపార సంస్థల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఏసీపీ సారంగపాణి మాట్లాడుతూ ఒక్క సీసీ కెమెరా 100 పోలీసులతో సమానం అని, ప్రజలందరూ తమ ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement