Wednesday, May 1, 2024

‘చిన‌జీయ‌ర్ స్వామి’ని ద‌ర్శించుకున్న ఏపీ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస్

ఏపీ దేవాదాయ‌శాఖ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస్, చిన జీయర్ స్వామిని ద‌ర్శించుకున్నారు. మంత్రి వెంట దేవాదాయ‌శాఖ ఉన్న‌తాధికారులు ఉన్నారు. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి శ్రీరామానుజ సహస్రాబ్ధి ఉత్సవాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఉత్సవ విశేషాలను అడిగి తెలుసుకున్నారు. 5వ తేదీన చేపట్టనున్న 216 అడుగుల రామానుజుల విగ్రహావిష్కరణ విశేషాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ నుంచి ఇద్దరు అధికారులను నియమించామని చిన జీయర్ కు వెల్లంపల్లి వెల్ల‌డించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement