Wednesday, April 24, 2024

ఏపీలో క‌రోనా కేసులు – ఆరోగ్య‌శాఖ హెల్త్ బులిటెన్

క‌రోనా ప్ర‌తిచోటా విల‌య‌తాండ‌వం చేస్తోంది. కాగా ఏపీలో క‌రోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. ఈ మేర‌కు ఏపీ రాష్ట్ర ఆరోగ్య‌శాఖ హెల్త్ బులిటెన్ ని విడుద‌ల చేసింది. కాగా ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల లో కొత్తగా 13,819 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 22,08, 955 కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరో 12 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 561 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 101396 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 5716 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20, 92 , 955 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 46, 929 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 3,22,34,226 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement