Thursday, May 2, 2024

న్యాయంకోసం నిల‌బ‌డిన మిమ్మ‌ల్ని చూస్తే గ‌ర్వంగా ఉంది కుష్భూ – కాంగ్రెస్ ఎంపీ శ‌శిథ‌రూర్

2002లో గుజ‌రాత్ అల్ల‌ర్లలో ముస్లిం మ‌హిళ బిల్కిస్ బానో అత్యాచారానికి గురైంది. ఈ కేసులో 11 మంది నిందితులను దోషులుగా నిర్ధారించి వారికి జీవితఖైదు విధించారు. అయితే, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వారిని ప్రభుత్వం విడుదల చేసింది. దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు భగ్గుమంటున్నాయి. న‌టి ..బిజెపి నాయ‌కురాలు కుష్బూ కూడా తీవ్రస్థాయిలో స్పందించారు. దారుణ హింసను ఎదుర్కొని, అత్యాచారానికి గురై, తల్లడిల్లిన హృదయంతో కుంగిపోయిన ఆ మహిళకు న్యాయం జరగాలి. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఏ ఒక్కరినీ విడిచిపెట్టకూడదు. ఒకవేళ వారిని విడిచిపెట్టారంటే అది మానవాళికే మచ్చలాంటిది, స్త్రీత్వానికే అవమానం. ఇలాంటి పరిస్థితుల్లో బిల్కిస్ బానో కానీ, మరే ఇతర మహిళ కానీ… రాజకీయాలకు, సిద్ధాంతాలకు అతీతంగా ఆమెకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంద‌న్నారు. అయితే గుజరాత్ లో ఉన్న బీజేపీ ప్రభుత్వమే ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ, ఓ మహిళగా ఆ నిర్ణయాన్ని కుష్బూ వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో కుష్బూని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అభినందించారు. కుష్బూ వినండి… మీరు స్వపక్షం కంటే న్యాయం కోసం నిలబడడం చూస్తుంటే గర్వంగా ఉంది అంటూ ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement