Thursday, April 25, 2024

పటాన్​చెరు దగ్గర రోడ్డు ప్రమాదం.. ఇంజినీరింగ్​ కాలేజీ స్టూడెంట్​ మృతి, నలుగురికి గాయాలు

హైదరాబాద్​ పటాన్​చెరు దగ్గర ఇవ్వాల (ఆదివారం) యాక్సిడెంట్​ జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఒకరు చనిపోయారు. మరో నలుగురు గాయపడ్డారు. వల్లూరుపల్లి నాగేశ్వరరావు (వీఎన్‌ఆర్‌) విజ్ఞాన జ్యోతికి చెందిన ఆరుగురు ఇంజినీరింగ్‌ విద్యార్థులు ఆగి ఉన్న బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. విద్యార్థులు రోడ్డు ట్రిప్​లో భాగంగా గోవా నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తున్నారు. పటాన్​చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇస్నాపూర్ వద్ద జాతీయ రహదారి-65పై ఈ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement