Wednesday, May 1, 2024

Vidyasagar Rao – BJP : మ‌ళ్లీ తెర‌పైకి రెండో రాజ‌ధానిగా హైద‌రాబాద్

మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత విద్యాసాగర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ కు రెండవ రాజధానిగా తెలంగాణ అయ్యే అవకాశం ఉందంటూ వ్యాఖ్యానించారు. కరీంనగర్ లో ఆయ‌న‌ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ దేశానికి రెండో రాజధాని అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగంలో ఈ అంశం ఉందని ఆయన వెల్లడించారు.

తెలంగాణ బీజేపీలో ఎటువంటి ఇబ్బందులు లేవని.. ఒకవేళ ఉంటే వాటి విషయం అధిష్టానం చూసుకుంటుందన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ను మారుస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు. కాగా, దేశంలో మరోసారి బీజేపీ గెలిచి, అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని, ప్రజలు అదే కోరుకుంటున్నారని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement