Monday, April 29, 2024

పేద‌ల పాలిట ఆప‌ద్భాంద‌వుడు కెసిఆర్ – మంత్రి కొప్పుల‌..

క‌రీంన‌గ‌ర్ : తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పేద‌ల పాలిట ఆప‌ద్భాంద‌వుడు అని మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ పేద‌ల‌కు వ‌రం అని పేర్కొన్నారు. ధ‌ర్మ‌పురి నియోజ‌క‌వ‌ర్గంలో రూ. 59,24,500 విలువ గ‌ల సీఎంఆర్ఎఫ్ చెక్కుల‌ను 193 మంది ల‌బ్ధిదారుల‌కు మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ అంద‌జేశారు.
ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ప్రజా సంక్షేమం కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా ఎంతో మంది పేదలకు నాణ్యమైన వైద్యమందించి ఆదుకుంటున్నట్లు తెలిపారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి పేదల పాలిట ఆపద్బాంధవుడు అని మంత్రి అన్నారు. ధర్మపురి నియోజక వర్గ పరిధిలోని ధర్మపురి, వెల్గటూర్, బుగ్గరాం, పెగడపల్లి, గొల్లపల్లి, ధర్మారం మండలంలోని వివిధ గ్రామాల‌కు చెందిన‌ లబ్ధిదారులకు మంత్రి కొప్పుల సీఎంఆర్ఎఫ్ చెక్కుల‌ను అంద‌జేశారు.
ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సంగి స‌త్తెమ్మ, జ‌డ్పీటీసీలు బత్తిని అరుణ, సుధారాణి, ఏఎంసీ చైర్మన్ అయ్యోరి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement