Monday, May 6, 2024

KNR | హైద‌రాబాద్‌ రెండో రాజధాని అయ్యే చాన్స్ ఉంది.. మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు

భారత్ కు హైదరాబాద్ రెండో రాజధానిగా అయ్యే అవకాశం ఉందని బీజేపీ సీనియర్ నేత, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం కరీంనగర్ లో ఓ ప్రైవేట్ ఫంక్షన్ కు హాజరైన ఆయన మీడియాతో చిట్ చాట్ చేస్తూ ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన‌ విష‌యాలు వెల్ల‌డించారు. హైద‌రాబాద్ దేశానికి రెండో రాజధాని అవుతుందనే నమ్మకం త‌న‌కు ఉంద‌న్నారు.
రాజ్యాంగంలో ఈ అంశం కూడా ఉందని గుర్తు చేశారు.

ఇక‌.. ఈ అంశంపై అన్ని పార్టీలు కలిసి రావాల‌ని, పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌ర‌గాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు విద్యాసాగ‌ర్‌రావు. తెలంగాణ బీజేపీలో ఎలాంటి ఇబ్బందులు లేవని.. ఏమైనా ఉంటె కేంద్ర అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు. దేశంలో మళ్ల‌ బీజేపీ గెలుస్తుందని, మోడీ ప్రభుత్వం వస్తుందని జోష్యం చెప్పారు. కొన్ని ఓట్లు జాయింట్ అకౌంట్ లో ఉన్నాయి.. వాటిని విడిపించుకునే సత్తా త‌మ నాయకులకు ఉందన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement