Sunday, April 28, 2024

భారీగా పెరిగిన‌ ఇంటి అద్దెలు.. డ‌బుల్ బెడ్రూం రూ.50వేలు

ఇంటి అద్దెలను భారీగా పెంచుతున్నార‌ట బెంగ‌ళూరు ఇంటి య‌జ‌మానులు. దాంతో ఉద్యోగులు ల‌బో దిబో మంటున్నారు. ప్ర‌పంచంలోని టెక్ సంస్థ‌లు త‌మ కేంద్రాల‌ను బెంగ‌ళూరులో ఏర్పాటు చేసుకున్నాయి. దాంతో బెంగ‌ళూరులో ఇంటి అద్దెలు ఆకాశానంటుతున్నాయి.కాగా డబుల్ బెడ్రూం ఇళ్ల అద్దెలకు రెక్కలొచ్చాయి. గతేడాది జనవరితో పోల్చితే ఇప్పుడు రెట్టింపు అద్దెలు వసూలు చేస్తున్నారు. బెంగళూరులో ప్రస్తుతం ఓ డబుల్ బెడ్రూం ఇంటికి నెలకు రూ.50 వేల అద్దె చెల్లించాల్సి వస్తోంది. దేశ రాజధాని ఢిల్లీతో పోల్చితే ఇది ఒకటిన్న రెట్లు అధికం. అంతేకాదు, ఢిల్లీలోని ఓ డబుల్ బెడ్రూం ఇంటితో పోల్చితే బెంగళూరులోని డబుల్ బెడ్రూం ఇల్లు పరిణామంలో సగం కూడా లేదని ఓ ఉద్యోగి వాపోయారు.

బెంగళూరులో 15 లక్షల మంది ఉద్యోగులు నివసిస్తున్నట్టు స‌మాచారం. కరోనా సంక్షోభం సమయంలో ఉద్యోగులందరూ సొంతూళ్లకు వెళ్లిపోయి వర్క్ ఫ్రం హోం విధానంలో పనిచేశారు. కరోనా వ్యాప్తి తగ్గిపోవడంతో ఉద్యోగులు తిరిగి బెంగళూరు చేరుకున్నారు. కరోనా వేళ ఖాళీగా ఉన్న అపార్ట్ మెంట్లు ఇప్పుడు ఫుల్ అయిపోయాయి. దాంతో అద్దె ఇళ్లకు డిమాండ్ ఎక్కువైంది. ఇదే అదనుగా ఇళ్ల యజమానులు అద్దెలు భారీగా పెంచేస్తున్నారు. డిమాండ్ పెరిగిపోయిన నేపథ్యంలో, అందుకు అనుగుణంగా కొత్త ఇళ్ల నిర్మాణం జరగకపోవడమే ఈ ఇంటి అద్దెల పెరుగుదలకు కారణమని అన్ జెన్ స్పేసెస్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ యజమాని అర్పణ్ బత్రా తెలిపారు. కాగా భారత్ కు ఐటీ రాజధానిగా వెలుగొందుతుంది బెంగళూరు.

Advertisement

తాజా వార్తలు

Advertisement