Friday, May 3, 2024

HYD: పేట్ బషీరాబాద్ లో పరువు హత్య

హైదరాబాద్ లోని పేట్ బషీరాబాద్ లో పరువు హత్య జరిగింది. డీజేగా పనిచేస్తున్న హరీష్ ను ఓ యువతి ప్రేమించింది. ఇద్దరి మధ్య కొన్నాళ్లుగా ప్రేమ కొనసాగుతోంది. పెద్దలకు తెలియకుండా జంట వివాహం చేసుకుంది. ఎవరి ఇంట్లో వాళ్లు ఉంటూనే ఈ జంట అప్పుడప్పుడూ కలుసుకుంటున్నారు. నిఘా పెట్టిన పేరెంట్స్ కు ప్రేమ వ్యవహారం తెలిసింది. హరీష్, ఆ యువతి కలిసి ఉండగా యువతి బంధువులు అటాక్ చేశారు. దూలపల్లిలో నడిరోడ్డుపైనే ఆమె ముందే హరీష్ పాశవికంగా హత్య చేశారు. కూతురు ఎదుటే ప్రేమించిన వ్యక్తిని హత్య చేశారు. భార్య బంధువులే హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement