Monday, April 29, 2024

హిందూపురంలో ర్యాలీ చేప‌ట్ట‌నున్న- ఎమ్మెల్యే, న‌టుడు బాల‌కృష్ణ‌

ఏపీలో కొత్త‌గా ప‌లు జిల్లాలను ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. కాగా హిందూపురం కేంద్రంగా జిల్లాని ప్ర‌క‌టించాల‌ని న‌టుడు, టిడిపి ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ డిమాండ్ చేశారు. కాగా రేపు హిందూపురంలో ఆయ‌న ర్యాలీ చేప‌ట్ట‌నున్నారు. ప‌ట్ట‌ణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఈ ర్యాలీ జరగనుంది. ర్యాలీ అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద బాలకృష్ణ మౌన దీక్ష చేపట్టనున్నారు. ఉద్యమ కార్యాచరణపై రేపు సాయంత్రం అఖిలపక్ష నేతలతో చర్చించనున్నారు. అనంతరం టీడీపీ కార్యకర్తలతోనూ సమావేశం కానున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement