Sunday, April 28, 2024

రేపే కేసీఆర్ సభ.. రూట్ క్లియర్!

నాగార్జున సాగర్ లో సీఎం కేసీఆర్ సభకు న్యాయస్థానంలో అడ్డంకులు తొలగిపోయాయి. సీఎం సభను రద్దు చేయాలంటూ దాఖలైన హౌస్ మోషన్ పిటిషన్ విచారణను హైకోర్టు చీఫ్ జస్టిస్ తిరస్కరించారు. సభను రద్దుచేయాలని రైతుల వేసిన పిటిషన్ ను విచారించడానికి హైకోర్టు అనుమతించలేదు. దీంతో బుధవారం సీఎం కేసీఆర్ సభ యథావిథిగా కొనసాగనుంది.

నాగార్జున సాగర్ సీఎం సభను రద్దు చేయాలని రైతులు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. నిన్న హైకోర్టు అత్యవసర అనుమతి నిరాకరించడంతో మరోసారి చీఫ్ జస్టిస్ బెంచ్ దగ్గర పిటిషన్ వేశారు. తమ అనుమతి లేకుండా తమ భూముల్లో సభ పెడుతున్నారని పిటీషన్ దాఖలు చేశారు. కోవిడ్ నిబంధనల దృష్టిలో ఉంచుకుని సభకు అనుమతి ఇవ్వొద్దని పిటీషన్ లో పేర్కొన్నారు. రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ సభ ఉన్న నేపథ్యంలో అనుమతి నిరాకరించాలని కోర్టును కోరారు.

కోవిడ్ నేపథ్యంలో సభలు, సమావేశాలు రద్దు చేస్తూ ప్రభుత్వం జీవో 69 విడుదల చేసి మళ్ళీ ఇలా లక్షలాది మందితో సభ ఎలా పెడతారని పిటిషన్ దాఖలు చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి సభకు రద్దు చేయాలన్నారు. హౌస్ మోషన్ కు అనుమతిపై ఎదురు చూసిన రైతులకు షాక్ తగిలింది. హౌస్ మోషన్ విచారణకు అనుమతి నిరాకరించిన న్యాయస్థానం రైతుల పిటిషన్‌ను తోసిపుచ్చింది. దీంతో సాగర్‌లో రేపు యాధావిధిగా సీఎం కేసీఆర్ సభ జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement