Saturday, April 27, 2024

రాజు మృతిపై జ్యుడీషియల్ విచారణకు హైకోర్టు ఆదేశం

తెలంగాణలో సంచలనం రేపిన సైదాబాద్ ఘటన కేసులో నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకోవడంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నిందితుడు రాజు మృతిపై జ్యుడీషియల్ విచారణకు హైకోర్టు ఆదేశించింది. రాజుది ఆత్మహత్య కాదని.. కస్టోడియల్ మృతిగా అనుమానం ఉందని పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ పిల్ హైకోర్టులో లంచ్ మోషన్ పిల్ దాఖలు చేశారు. దీని​పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని మేజిస్ట్రేట్ కు హైకోర్టు ఆదేశించింది. వరంగల్ 3వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కు విచారణ బాధ్యతలు అప్పగించింది. నాలుగు వారాల్లో సీల్డు కవర్ లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

వాదనల సందర్భంగా రాజును పోలీసులు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని పిటిషనర్ అన్నారు. అయితే, రాజు ఆత్మహత్య చేసుకున్నాడని ఏజీ ప్రసాద్ తెలిపారు. ఏడుగురి సాక్ష్యాల నమోదు ప్రక్రియ వీడియా చిత్రీకరణ జరిగిందని చెప్పారు. పోస్టుమార్టం వీడియో చిత్రీకరణ జరిగినట్లు వివరించారు. వీడియోలు రేపు రాత్రి 8 లోగా వరంగల్ జిల్లా జడ్జికి అప్పగించాలని హైకోర్టు ఆదేశించింది.

కాగా, వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ సమీపంలోని నిందితుడు రాజు గురువారం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. రాజు చేతిపై మౌనిక అనే పచ్చబొట్టు ఆధారంగా అతన్ని గుర్తించారు. ఈ నెల 9న సైదాబాద్ లో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన తర్వాత రాజు పరారీలో ఉన్నాడు. రాజు కోసం పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా గాలింపు చేపట్టడం సహా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడంతో ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు.

మరోవైపు పోలీసులే తన భర్తను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని నిందితుడు రాజు భాగ్య మౌనిక ఆరోపించింది. తన భర్తను పోలీసులు తీసుకెళ్లి హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేసింది. తన భర్త మంచోడని, ఇలాంటి ఘోరాలు చేసే వ్యక్తి కాదని పేర్కొంది. ఒకవేళ నిజంగా తన భర్త తప్పు చేస్తే చట్టపరంగా నిరూపించి శిక్షించాలని, ఇలా చంపేసి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త ఇన్ని రోజులు పోలీసుల అదుపులోనే ఉన్నాడని, అతడిని చిత్రహింసలకు గురిచేసి చంపేశారని మౌనిక ఆరోపించింది. అయితే, దీనిపై తెలంగాణ డీపీజీ మహేందర్ రెడ్డి కూడా వివరణ ఇచ్చారు. రాజుది ఆత్మహత్యేనని స్పష్టం చేశారు.

- Advertisement -

ఇది కూడా చదవండి: రాజుది ఆత్మహత్యే.. అనుమానాలొద్దు: డీజీపీ

Advertisement

తాజా వార్తలు

Advertisement