Friday, March 29, 2024

2024లో తెలంగాణలో అధికారంలోకి వస్తాం: అమిత్‌షా

తెలంగాణలో 2024లో జరిగే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని తెలిపారు. మజ్లీస్‌ పార్టీకి బీజేపీ పార్టీ అస్సలు భయపడదని… తెలంగాణ ప్రజలందరికీ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు అని అమిత్‌ షా తెలిపారు.

సర్దార్‌ పటేల్‌ సైనిక చర్య కారణంగానే తెలంగాణ రాష్ట్రానికి స్వేచ్ఛ లభించిందని అమిత్ షా అన్నారు. నిజాం రాక్షస పాలను నుంచి తెలంగాణ రాష్ట్రానికి విముక్తి కలిగిన రోజు సెప్టెంబర్‌ 17వ తేదీ అని ఆయన పేర్కొన్నారు. సెప్టెంబర్‌ 17వ తేదీని.. విమోచన దినోత్సవం గా నిర్వహించాలని అప్పట్లో సీఎం కేసీఆర్‌ డిమాండ్‌ చేశారని… మరి ఇప్పుడు కేసీఆర్‌ డిమాండ్‌ ఏమైందని అమిత్ షా నిలదీశారు. కేసీఆర్‌… విమోచన దినాన్ని ఎందుకు అధికారికంగా నిర్వహించడం లేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ ఎవరికీ భయపడుతున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement