Sunday, April 28, 2024

క‌డ‌ప‌లో స‌మంత : న‌టిని చూసేందుకు ఎగ‌బ‌డిన జ‌నం

షాపింగ్ మాల్ ప్రారంభోత్స‌వానికి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత వెళ్లింది. దాంతో స‌మంత‌ని చూసేందుకు జ‌నం ఎగ‌బ‌డ్డారు. ఇసుక‌వేస్తే రాల‌నంత జ‌నం వ‌చ్చారు. క‌డ‌ప ఆర్టీసీ బస్టాండ్ వ‌ద్ద షాపింగ్ మాల్ ప్రారంభోత్స‌వానికి స‌మంత‌ వ‌చ్చింది. ఆ షాపింగ్ మాల్‌ను ప్రారంభించి కాసేపు అక్క‌డ వుండి సంద‌డి చేసింది. స‌మంత‌ను చూసేందుకు స్థానికులు భారీగా త‌ర‌లివ‌చ్చారు. ఇసుక‌వేస్తే రాల‌నంత జ‌నం రావ‌డం గ‌మ‌నార్హం. స‌మంత‌తో ఫొటోలు దిగేందుకు అభిమానులు పోటీ ప‌డ్డారు. దాంతో ఆర్టీసీ బ‌స్టాండ్ స‌మీపంలో ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. పోలీసులు బందోబ‌స్తూ ఏర్పాటు చేశారు. అభిమానుల‌కు స‌మంత అభివాదం చేసింది. చిరున‌వ్వులు చిందిస్తూ ఫొటోల‌కు ఫోజులిచ్చింది. ఇప్పుడీ వీడియో వైర‌ల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement