Monday, May 6, 2024

రెండు పార్టులుగా ‘స‌లార్’ మూవీ

ప‌లు భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాడు యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్. ఆదిపురుష్‌, రాధేశ్యామ్, స‌లార్ ఇలా అన్నీ పాన్ ఇండియా చిత్రాలే. కాగా స‌లార్ మూవీ రెండు భాగాలుగా తెర‌కెక్క‌నుంద‌ని అధికారికంగా ట్వీట్ చేశారు. ఈ సినిమాలో డార్లింగ్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా 40 శాతం షూటింగ్ పూర్తి అయిందని వార్తలొస్తున్నాయి.

గతంలో ప్రభాస్ నటించిన బాహుబలి చిత్రం రెండు పార్టులుగా రిలీజై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి అదే రిపీట్ కాబోతుందని ప్రభాస్ ఫ్యాన్స్ అంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా సలార్ హ్యాష్ టాగ్ వైరల్ అవుతోంది. ఇక హాంబేల్​ ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రవి బసృత్ సంగీతం అందిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement