Wednesday, May 1, 2024

ప‌వ‌న్ క‌ల్యాణ్ ని క‌లిసిన ప్రియ‌ద‌ర్శి – మ‌రిచిపోలేని అనుభూతి అంటోన్న న‌టుడు

ప‌వ‌ర్ స్టార ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇది పేరు కాదు..ఓ బ్రాండ్ ..ఈయ‌న‌కి జ‌నాలే కాదు..సెల‌బ్రిటీల‌లో కూడా ఎన‌లేని అభిమానులు ఉన్నారు. ఆయ‌న సోష‌ల్ స‌ర్వీస్ కి ఫిదా అయిన వారు ఉన్నారు. కాగా భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్ చిత్రం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ ని చూడ‌టానికి హైద‌రాబాద్ అమీర్ పేట‌లోని సార‌థి స్టూడియోకి వ‌చ్చారు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్ తెర‌కెక్కిస్తున్నారు.కాగా దర్శకుడు హరీశ్ శంకర్ కూడా పవన్ కల్యాణ్ తో ఉన్నారు. ఈ సమయంలోనే స్టూడియోలో కమెడియన్ ప్రియదర్శి ఉన్నారు. ఆయన పవన్ కల్యాణ్ అభిమాని. తాను పవన్ కల్యాణ్ ను కలిసే అవకాశం కల్పించిన దర్శకుడు హరీశ్ శంకర్ కు థాంక్స్ చెప్తూ ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టారు. సదరు ట్వీట్ లో తను పవన్ కల్యాణ్ తో దిగిన ఫొటోతో పాటు ఆటోగ్రాఫ్ తీసుకున్న ఫొటో షేర్ చేశారు. తనకు పవన్ కల్యాణ్ తీసిన ‘జానీ’ సినిమా చాలా ఇష్టమని, అది తనకు ఎంతో నచ్చిందన్న విషయం ఎట్టకేలకు పవన్ కల్యాణ్ కు చెప్పానని ప్రియదర్శి తెలిపారు. పవన్ కల్యా్ణ్ ను కలిసి ఆయనతో మాట్లాడటం తన జీవితంలో మరిచిపోలేని గొప్ప అనుభూతిని వివరించారు ప్రియదర్శి. కాగా ఈ చిత్రం కోసం ప‌వ‌న్ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement