Friday, May 17, 2024

బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రామన్నగూడెం తండా గ్రామంలో పరకాల నుండి జూబ్లీ నగర్ వరకు బస్ సర్వీస్ ను శనివారం ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ రామన్నగూడెం తండా గ్రామంలో బస్ సర్వీస్ ప్రారంభించుకోవడం మంచి శుభపరిణామం అన్నారు. ప్రజల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ నష్టాల్లో ఉన్నప్పటికీ ప్రజలు ఇబ్బంది పడకూడదని ఆర్టీసీ బస్సులను నడుపుతోందన్నారు. ప్రజలందరూ ఈ బస్ సర్వీస్ ఉపయోగించుకుని తమ గమ్యాలను సురక్షితంగా చేరుకోవచ్చని తెలిపారు. అడగగానే బస్ సర్వీస్ ఏర్పాటు చేసిన పరకాల బస్ డిపో మేనేజర్ కి స్థానిక ప్రజల తరుపున ప్రత్యేక అభినందనలు తెలిపారు. అదేవిధంగా ఈ సర్వీస్ ను ప్రజల సౌకర్యార్థం ములుగు వరకు నడపాలని డిపో మేనేజర్ ని కోరారు. అనంతరం టికెట్ తీసుకుని బస్ లోని ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, జడ్పీటీసి, మండల పార్టీ అధ్యక్షులు, పీఏసీఎస్ చైర్మన్, నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement