Sunday, May 19, 2024

లక్ష్మీ బ్యారేజ్​కి భారీగా వ‌ర‌ద‌.. 65 గేట్లు ఎత్తి దిగువ‌కు నీటి విడుద‌ల

మహదేవపూర్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళే శ్వరం ప్రాజెక్టు అంబట్ పల్లి లో ఉన్న లక్ష్మీ (మేడిగడ్డ ) బరాజ్ కి భారీగా వరద పెరిగింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరి, ఎగువన ఉన్న మహారాష్ట్రలో ప్రాణహిత నది నుండి వరద ఉదృతి పెరిగింది. పూర్తి నిల్వ నీటి సామర్థ్యం 16.17 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 3.8 టీఎంసీల నీరు ఉంది. శనివారం ఇన్ ఫ్లో 1,15,860 క్యూసెక్కులు ఉండగా, ఆదివారం ఉద‌యం 4,93,540 క్యూసెక్కులకు చేరింది. దీంతో బ్యారేజ్ 85 గేట్లలో ప్రస్తుతం 65గేట్లు ఓపెన్ చేసి నీటిని దిగువ‌కు వ‌దులుతున్నారు. ప్ర‌స్తుతం అవుట్ ఫ్లో 5,54,660 క్యూసెక్కులుగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement