Friday, May 17, 2024

పెరిగిన క‌రోనా కేసులు-కొత్త‌గా 18,257

క‌రోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి..నేడు దేశంలో కొత్తగా 18,257 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,36,22,651 కు చేరాయి. ఇందులో 4,29,68,533 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,428 మంది మహమ్మారికి బలయ్యారు. మరో 1,28,690 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 42 మంది కరోనాతో మృతిచెందారు. 14,553 మంది డిశ్చార్జీ అయ్యారు.కరోనా కేసులు భారీగా నమోదవుతుండటంతో రోజువారీ పాజిటివిటీ రేటు 4.22 శాతానికి పెరిగిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక మొత్తం కేసుల్లో 0.30 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీరేటు 98.50 శాతం, మరణాల రేటు 1.20 శాతంగా ఉన్నదని తెలిపింది. ఇప్పటివరకు 198.76 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement