Sunday, May 19, 2024

కృష్ణా జిల్లా గుడివాడలో విషాదం.. విద్యుత్ వైర్లు తెగిప‌డి మ‌హిళ మృతి

కృష్ణా జిల్లా గుడివాడలో విద్యుత్ షాక్‌తో ఒక‌రు చ‌నిపోయారు. తొలి ఏకాదశి రోజు ఉదయాన్నే విషాదం చోటుచేసుకుంది. స్థానిక జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్ సమీపంలో విద్యుత్ వైర్లు తెగిపడి మహిళ చ‌నిపోయింది. సుమారు 55 సంవత్సరాలు వయసు కలిగిన మహిళపై విద్యుత్ వైరు తెగ పడటంతో ఈ ప్రమాదం జ‌రిగిన‌ట్టు స్థానికులు తెలిపారు. దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement