Friday, April 26, 2024

శభాష్.. మానవత్వం చాటుకున్న హెడ్ కానిస్టేబుల్

అసలే కరోనా కాలం. మనిషిని చూస్తే మనిషే భయపడి దూరంగా జరుగుతున్న సమయం ఇది. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు పోలీసులు మాత్రం విధులు నిర్వహిస్తూ.. తమ మానవత్వాన్ని చాటుకున్నారు. అందుకు ఉదాహరణగా నిలుస్తున్నారు ప్రకాశం జిల్లాకు చెందిన ఓ పోలీస్ హెడ్ కానిస్టేబుల్.

దోర్నాల పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ సురేష్ గుర్తు తెలియని మృతదేహాన్ని కర్ర సాయంతో భుజాన వేసుకొని కిలోమీటరు మోసి మానవత్వాన్ని చాటుకున్నాడు. దోర్నాల మండలం మర్రి పాలెం అడవి ప్రాంతంలో  గుర్తుతెలియని మృతదేహాన్ని  తరలించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో  మృతదేహానికి కర్రకు కట్టుకొని  మోసుకుంటూ కిలోమీటర్ మేర  తరలించి మానవత్వం చాటుకున్నాడు  హెడ్ కానిస్టేబుల్ సురేష్. దీంతో ప్రజలు, ఉన్నతాధికారులు హెడ్ కానిస్టేబుల్ సురేష్‌ ను అభినందనలు తెలుపుతున్నారు . అందరితో శభాష్ అనిపిచ్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement