గుజరాత్కు చెందిన పటీదార్ ఉద్యమ నేత ఈ నెల 18న కాంగ్రెస్కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే హార్దిక్ పటేల్ బీజేపీలో చేరనున్నారు. జూన్ 2వ తేదీన బీజేపీలో చేరనున్నట్లు ధ్రువీకరించారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ముందు హార్దిక్ పార్టీని వీడడంతో కాంగ్రెస్కు పెద్ద ఎదురుదెబ్బగా రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు. 2019లో కాంగ్రెస్లో చేరిన హార్దిక్ పటేల్.. 2020, జూలై 11న గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియామకమయ్యారు. అయితే ఆయనకు పార్టీ అధిష్టానం, నాయకత్వం తీరు నచ్చకపోవడంతో రాజీనామా చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement