Tuesday, April 30, 2024

ఒక్కొక్కరి ఖతాలో రూ.24 వేలు

ఏపీలో చేనేత కార్మికులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మూడవ విడత వైఎస్సార్‌ నేతన్న నేస్తంను  అమలు చేయనున్నారు. మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాలోకి సొమ్మును జమచేయనున్నారు. ప్రతి ఒక లబ్ధిదారుని ఖాతాలో రూ. 24 వేలు చొప్పున నగదు జమకానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రూ.166.14 కోట్లు నేరుగా 69,225 చేనేత కుటుంబాల ఖాతాలకు జమ చేస్తారు. కరోనా కష్టకాలంలోనూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది ఈ పథకాన్ని అమలు చేస్తోంది.

నేతన్న నేస్తం కింద సొంత మగ్గం కలిగిన చేనేత కుటుంబాలకు ఏడాదికి రూ.24 వేలు అందిస్తారు. సొంతంగా మగ్గాలున్న ప్రతీ కుటుంబానికి వైఎస్ఆర్ చేనేత నేస్తం పథకం అందుతుంది. కుటుంబానికి ఎన్ని మగ్గాలున్నా ఒక యూనిట్ గానే పరిగణిస్తారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉండి, మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబం ఈ పథకానికి అర్హులు. ఈ పథకంతో నేతన్నల మగ్గం ఆధునీకరణ, నూలు కొనుగోలుకు తోడ్పాటును అందించేందుకు అవకాశం ఏర్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. పాదయాత్రతో పాటూ నవరత్నాల్లో భాగంగా నేతన్నలకు చేయూత ఇస్తానని చెప్పిన హామీని జగన్‌మోహన్‌రెడ్డి నెరవేర్చారు. వరుసగా మూడో ఏడాది ఈ పథకం అమలు చేసేందుకు సిద్ధమైంది.

ఇది కూడా చదవండి: హుజురాబాద్ కు రూ.500 కోట్లు.. దళిత బంధు నిధులు విడుదల

Advertisement

తాజా వార్తలు

Advertisement