Tuesday, April 30, 2024

గురువు శ‌వ‌పేటిక‌ను మోసిన – ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్

కొరియ‌న్ పీపుల్స్ ఆర్మీ మార్ష‌ల్ హ్యోన్ చొల్ హ‌యే ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్ జాంగ్ ఉన్ గురువు. కాగా కిమ్ గురువు అనారోగ్య కార‌ణాల‌తో మ‌ర‌ణించారు. దాంతో ఆయ‌న‌ అంత్యక్రియల్లో స్వయంగా పాల్గొని కిమ్ నివాళులు అర్పించ‌డం విశేషం. ఇటీవ‌ల మాస్కు ధ‌రించి క‌న‌ప‌డిన కిమ్‌.. గురువు అంత్య‌క్రియ‌ల్లో మాత్రం మాస్కు లేకుండా క‌న‌ప‌డ్డారు. ఇత‌రులు అంద‌రూ మాస్కులు ధరించి ఇందులో పాల్గొన్నారు. గురువు శవపేటికను స్వ‌యంగా మోశారు. కాగా, కిమ్ జాంగ్‌-2 మ‌ర‌ణం అనంత‌రం కిమ్ జాంగ్ ఉన్‌ను అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టడంలో కొరియన్‌ పీపుల్స్‌ ఆర్మీ మార్షల్‌ హ్యోన్‌ చొల్‌ హయే కీలక పాత్ర పోషించారు. అందుకే గురువుపై కిమ్ అంతగా భ‌క్తిని చాటుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement