Sunday, April 28, 2024

అంబేద్కర్ ఈ దేశంలో జన్మించడం భారతజాతి చేసుకున్న అదృష్టం – ప్రభుత్వ చీఫ్ విప్

రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 131వ జయంతిని పురస్కరించుకొని నివాళులు అర్పించారు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్.. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా బడుగు, బలహీన వర్గాల హక్కులకు ఎలాంటి అవరోధాలు కలగకూడదనే ఉద్దేశంతో, వారికి కచ్చితమైన భరోసాని, భవిష్యత్తుని ఇచ్చేలా రాజ్యాంగాన్ని రూపొందించిన దార్శనికుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు. అంబేద్కర్ ఈ దేశంలో జన్మించడం భారతజాతి చేసుకున్న అదృష్టం. దేశ పురోగమనానికి పునాదులు వేసిన అంబేద్కర్ గారు అందించిన సేవలను ప్రతి భారతీయుడు స్మరించుకోవాలి.అంబేద్కర్ స్ఫూర్తితోనే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలు, వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా వేల కోట్ల రూపాయలతో ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలను రూపొందించి అమలుపరుస్తున్నారు.
దళిత సాధికారత కోసం, డా. బి. ఆర్.అంబేడ్కర్ ఆశయ సాధన లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల అభ్యున్నతికి దేశంలోనే ఎక్కడాలేని విధంగా, దళితబంధు పథకం ద్వారా అర్హులైన దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల భారీ మొత్తాన్ని నూటికి నూరు శాతం సబ్సిడీ కింద ఆర్థిక సహాయం అందిస్తున్నారు.

బడుగు బలహీనర్గాల వెనుకబాటుతనాన్ని రూపుమాపేందుకు చదువే శక్తివంతమైన ఆయుధమని భావించిన ప్రభుత్వం అణగారిన వర్గాలకు చెందిన విద్యార్థుల విద్య కోసం కోట్లాది రూపాయలను వెచ్చిస్తున్నదని.కేసీఆర్ గారి ముందు చూపుతో అత్యున్నత ప్రమాణాలతో ఏర్పాటు చేసిన గురుకులాలు విజయ వంతంగా నడుస్తున్నాయి.అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి ద్వారా విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే ఎస్సీ,ఎస్టీ విద్యార్థుల్లో అర్హులైన వారికి 20 లక్షల రూపాయలను స్కాలర్ షిప్ గా అందిస్తూ, వారి కలలను తెలంగాణ ప్రభుత్వం నిజం చేస్తున్నది.ఎస్సీ, ఎస్టీల సమగ్రాభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న కార్యక్రమాలతో వారి జీవనప్రమాణాలు మెరుగై, ఆత్మగౌరవంతో జీవిస్తున్నారు.హనుమకొండ జిల్లా వ్యాప్తంగా ఈరోజు 42 యూనిట్లను దళిత బంధు పథకం ద్వారా లబ్ధిదారులకు అందజేయడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement