Saturday, May 18, 2024

గమనిక: రెండు రోజుల పాటు ప్రభుత్వ వైబ్ సైట్లకు అంతరాయం

తెలంగాణలో రెండు రోజుల పాటు ఆన్‌లైన్ సేవలు నిలిచిపోనున్నాయి. రేపు రాత్రి 9 గంటల నుంచి 11వ తేదీ రాత్రి 9 గంటల వరకు ప్రభుత్వ వెబ్‌సైట్ల సేవలకు అంతరాయం ఏర్పడుతుందని పేర్కొన్న ప్రభుత్వం అన్ని శాఖలకు ఈ సమాచారాన్ని అందించింది. రాష్ట్రంలో ఆన్‌లైన్ సేవలు అంతకంతకు పెరుగుతుండటం..అదే సమయంలో విద్యుత్ అంతరాయాలు కూడా ఏర్పడుతుండటంతో..ప్రస్తుతం ఉన్న అన్ ఇంటరప్టబుల్ పవర్ సప్లై (యూపీఎస్) సామర్థ్యం సరిపోవడం లేదు. ఇది ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడంతో దాని స్థాయిని పెంచాలని నిపుణులు ప్రతిపాదించారు. దీంతో కొత్త యూపీఎస్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రెండు రోజుల పాటు అన్ని ప్రభుత్వం వెబ్ సైట్లు నిలిచిపోనున్నాయి. అంతేకాదు.. ప్రభుత్వ ఉత్తర్వుల జారీ కూడా నిలిచిపోనుంది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల  సంస్థ భవనంలోని రాష్ట్ర డేటా కేంద్రం (ఎస్‌డీసీ)లో కొత్త యూపీఎస్ యూనిట్ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ప్రభుత్వ వెబ్‌సైట్ సేవలకు అంతరాయం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి: రేవంత్ వెంటే కేసీఆర్ వ్యతిరేక వర్గం!

Advertisement

తాజా వార్తలు

Advertisement