Tuesday, April 30, 2024

Breaking | ప‌ట్టాలు త‌ప్పిన గూడ్స్ బండి.. రైళ్ల రాక‌పోక‌ల‌కు ఇబ్బంది లేద‌న్న అధికారులు

ఒడిశాలో గూడ్స్ బండి ప‌ట్టాలు త‌ప్పింది. రాయగడ్ జిల్లాలోని అంబడోల సమీపంలో ఇవ్వాల (శ‌నివారం) గూడ్స్ రైలుకు చెందిన‌ నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని రైల్వే అధికారులు తెలిపారు. అయితే.. ఈ రైలు ప్రత్యేక రూట్లో వెళ్తున్నందున‌ ఇతర రైళ్ల రాకపోకలకు ఎలాంటి అంతరాయం క‌ల‌గ‌లేద‌ని వెల్లడించారు. ఈ విషయం తెలియగానే రైల్వే అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. పట్టాలు తప్పడానికి గల కారణాలను ఆరా తీసే పనిలో ఉన్నారు. గూడ్స్ రైలు అంబడోలా నుండి ప్రత్యేక రూట్ లో లాంజీగర్ వేదాంత లిమిటెడ్ ప్లాంట్ కు వెళ్తున్న‌ట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement