Tuesday, April 30, 2024

Big Breaking | బైకును ఢీకొన్న కారు.. రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతి

రోడ్డుప్రమాదంలో కొత్తగా పెళ్లైన అమ్మాయి చనిపోయిన ఘటన ఇవ్వాల (శనివారం) రాత్రి ఖమ్మం జిల్లాలో జరిగింది. మధిర రాయపట్నం గ్రామాల మధ్య ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఖమ్మం సిటీ టేకులపల్లికి చెందిన ఓ యువతి బంధువుల ఊరికి వెళ్లింది. నందిగామ మండలం కొంతమత్కూరుకు వచ్చి అక్కడి నుంచి ద్విచక్ర వాహనంపై భర్తతో కలిసి మధిరకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ఎదురుగా వస్తున్న కారు వీరి బైకును ఢీకొనటంతో కిందపడి అక్కడికక్కడే చనిపోయింది. బైకు మీద ఉన్నవారికి స్వల్ప గాయాలయ్యాయి. మృతురాలు సంధ్యకు వివాహమై ఐదు నెలలు అవుతోంది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందటంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. పెళ్లయి కొద్ది కాలానికే ప్రమాదంలో చనిపోవడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరు అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement