Sunday, April 28, 2024

రాధేశ్యామ్ చిత్ర యూనిట్ కి శుభ‌వార్త – తెలంగాణ‌లో 5షోల‌కి అనుమ‌తి

రాధేశ్యామ్ చిత్ర యూనిట్ కి శుభ‌వార్త చెప్పింది తెలంగాణ ప్ర‌భుత్వం. ఈ చిత్రం రేపు రిలీజ్ కానుంది. దాంతో తెలంగాణ‌లో ఐదు షోలను ప్ర‌ద‌ర్శించుకునేందుకు అనుమ‌తినిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది తెలంగాణ ప్ర‌భుత్వం. ఇందుకు సంబంధించి జీవో నెంబర్ 10ని జారీ చేసింది. ఉదయం 10 గంటల నుంచి అర్ధరాత్రి 1 వరకు షోలను వేసుకునేందుకు థియేటర్లకు అనుమతిస్తున్నట్టు పేర్కొంది. అర్ధరాత్రి 1 తర్వాత నుంచి ఉదయం 10 గంటల్లోపు ఎటువంటి షోలను ప్రదర్శించరాదని అదే జీవోలో స్పష్టం చేసింది. రాధేశ్యామ్ సినిమాపై అభిమానుల్లో చాలా అంచనాలే ఉన్నాయి.పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటించింది. ఈ సినిమాకు రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. 11న ప్రపంచవ్యాప్తంగా రాధేశ్యామ్ విడుదలకు ఏర్పాట్లు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement