Monday, May 20, 2024

పెరిగిన బంగారం ధరలు..పసిడి బాటలోనే వెండి కూడా

నేటి బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.150 పెరిగి రూ.47 వేలకు చేరుకుంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన బంగారం ధర రూ.170 పెరిగి రూ.51,289గా రికార్డయింది. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు పెరిగాయి. అక్కడ కూడా 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.100 పెరిగి రూ.47,150కి చేరుకుంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.120 బలపడి రూ.51,430గా ఉంది. విజయవాడ మార్కెట్లో బంగారం ధరలు పెరుగుదలనే నమోదు చేశాయి. విజయవాడలో కూడా 22 క్యారెట్లకు చెందిన ధర రూ.150 పెరిగింది. దీంతో ఈ ధర రూ.47 వేలకు చేరుకుంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.170 పెరిగి రూ.51,280కి ఎగిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement