Thursday, May 2, 2024

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..భయభ్రాంతులకు గురై పరుగులు తీసిన జనం

58వ్యాగన్లతో బొగ్గు లోడుతో ధన్ బాద్ డివిజన్ లోని గయ కోడెర్మా మార్గంలో ప్రయాణిస్తున్న రైలు గుర్పా రైల్వేస్టేషన్ లో తెల్లవారుజామున 6.24 గంటలకు పట్టాలు తప్పింది. బ్రేకులు ఫెయిల్ కావడంతో పట్టాలు తప్పిన వ్యాగన్లను రైలు ఈడ్చుకుపోయింది. వ్యాగన్లు ట్రాక్ వెంబడి చెల్లాచెదురుగా పడ్డాయి.ఈ సంఘటన బీహార్‌లో చోటు చేసుకుంది. ఓ గూడ్స్‌ రైలు పట్టాలు తప్పిన ఘటనలో 53 వ్యాగన్లు చెల్లాచెదురయ్యాయి. దీంతో పలు రైళ్ల రాకపోకలకు గంటలపాటు అంతరాయం ఏర్పడింది. పట్టాలు తప్పిన వ్యాగన్లను పెద్ద శబ్దంతో రైలు ఈడ్చుకుపోతుండడాన్ని చూసి జనం భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రైల్వే అధికారులు వ్యాగన్లు తొలగించి, ట్రాకుల పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఈ కారణంగా ఆ మార్గంలో ప్రయాణించాల్సిన పలు రైళ్లకు అంతరాయం కలిగినట్టు ఈస్ట్‌కోస్ట్ రైల్వే తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement