Wednesday, May 15, 2024

Gold Rate: పసిడి ధర పైపైకి.. పెరిగిన బంగారం, వెండి ధరలు

పసిడి ప్రేమికులకు బ్యాడ్ న్యూస్. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర ఈరోజు మాత్రం పెరిగింది. వెండి ధర కూడా బంగారం దారిలోనే నడిచింది. హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 160 పెరిగింది. దీంతో పసిడి రేటు రూ. 51,760కు ఎగసింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.150 పెరుగుదలతో రూ. 47,450కు చేరింది. బంగారం ధరలు పెరిగితే.. వెండి రేటు రూ. 600 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ. 72,900కు చేరింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement