Wednesday, May 15, 2024

నాలుగ‌వ‌రోజు స్టాక్ మార్కెట్ కి న‌ష్టాలే

వ‌రుస‌గా నాలుగ‌వ‌రోజు స్టాక్ మార్కెట్ న‌ష్టాల‌తో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత తీవ్ర ఒడిదుడుకుల మధ్య కొనసాగుతూ చివరకు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 152 పాయింట్లు నష్టపోయి 52,541కి పడిపోయింది. నిఫ్టీ 39 పాయింట్లు కోల్పోయి 15,692 వద్ద స్థిరపడింది. బజాజ్ ఫిన్ సర్వ్ (4.24%), బజాజ్ ఫైనాన్స్ (2.04%), టాటా స్టీల్ (1.52%), ఎల్ అండ్ టీ (0.97%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (0.83%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి.. ఎన్టీపీసీ (-2.02%), ఇన్ఫోసిస్ (-1.29%), రిలయన్స్ (-1.18%), విప్రో (-1.07%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.01%) టాప్ లూజర్స్ గా మిగిలాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement