Monday, April 29, 2024

నాలుగో రోజు లాభాల‌తో ముగిసిన – స్టాక్ మార్కెట్లు

వ‌రుస‌గా నాలుగ‌వ రోజు లాభాల‌తో ముగిశాయి నేటి స్టాక్ మార్కెట్లు. యూరప్ కు రష్యా గ్యాస్ సరఫరా మళ్లీ ప్రారంభం కాబోతోందనే అంచనాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచాయి. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 630 పాయింట్లు లాభపడి 55,398కి చేరుకుంది. నిఫ్టీ 180 పాయింట్లు పెరిగి 16,521 వద్ద స్థిరపడింది. టెక్ మహీంద్రా (3.61%), టీసీఎస్ (2.89%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (2.81%), రిలయన్స్ (2.47%), ఇన్ఫోసిస్ (2.02%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి.. మహీంద్రా అండ్ మహీంద్రా (-1.80%), సన్ ఫార్మా (-0.87%), కొటక్ బ్యాంక్ (-0.48%), ఏసియన్ పెయింట్స్ (-0.46%), భారతి ఎయిర్ టెల్ (-0.40%) టాప్ లూజర్స్ గా మిగిలాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement