Sunday, May 5, 2024

Big Breaking: రాజ్యసభకు నలుగురు ప్రముఖుల నామినేట్​.. రాజమౌళి తండ్రికి చాన్స్​

రాజ్యసభకు నలుగురు దక్షిణాది ప్రముఖులను నామినేట్​ చేసినట్టు ప్రధాని మోదీ ట్వీట్​ చేశారు. వీరిలో సినిమా ఇండస్ట్రీకి చెందిన వారుండడం విశేషంగా చెప్పుకోవచ్చు. దర్శక ధీరుడు ఎస్​ ఎస్​ రాజమౌళి తండ్రి కథా రచయిత అయిన విజయేంద్రప్రసాద్​, మ్యూజిక్​ డైరెక్టర్​ ఇళయరాజా ఉన్నారు. మరో వ్యక్తిని స్పోర్ట్స్​ పర్సన్​ అయిన పీటీ ఉషా, వీ హెగ్డే ఉన్నారు. వీరి గురించి ప్రధాని ట్వీట్​లో వెల్లడించారు. తెలంగాణ, కర్నాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇచ్చారు. వీరిని రాజ్యసభకు నామినేట్​ చేస్తున్నట్టు స్వయంగా ప్రధాని మోదీ ట్వీట్​ చేయడం విశేషం. రాష్ట్రపతి కోటాలో ప్రముఖులను నామినేట్​ చేస్తున్నట్టు ప్రధాని మోదీ తన ట్వీట్​ లో పేర్కొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement