Thursday, May 2, 2024

Haryana: రోడ్డు ప్ర‌మాదంలో … నలుగురు ఉద్యోగుల‌ మృతి

ఓ రోడ్డుప్ర‌మాదంలో న‌లుగురు ఉద్యోగులు మృతి చెందిన విషాద ఘ‌ట‌న‌ హర్యానా గురుగ్రామ్‌లోని ఢిల్లీ – జైపూర్‌ హైవేపై చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయ‌ప‌డిన వారిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం ప్రకారం.. బిలాస్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఢిల్లీ-జైపూర్ హైవేపై రాత్రి ఒంటిగంట సమయంలో వేగంగా వస్తున్న ట్రక్కు అదుపుతప్పి ఇన్నోవాపై బోల్తాపడినట్లు సమాచారం. సమాచారం అందుకున్న అనంతరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కారులో చిక్కుకున్న వారిని రక్షించారు. అప్పటికే నలుగురు కారులోనే మృతి చెందారు. ఇద్దరు తీవ్రంగా గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. మృతులు, క్షతగాత్రులు నోయిడాకు చెందిన ఓ మల్టీనేషనల్‌ కంపెనీ ఉద్యోగులుగా తెలిసిందని పోలీసులు తెలిపారు. సోమవారం విహారయాత్ర కోసం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement